అనంత పద్మ నాభ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయ మూర్తి నగేష్ భీమపక – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
అనంత పద్మ నాభ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయ మూర్తి నగేష్ భీమపక - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జిలు

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వైష్ణవ క్షే త్రాలలో ప్రసిద్ధ క్షేత్రమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలోని శ్రీ అనంత పద్మ నాభ స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయ మూర్తి నగేష్ భీమపక దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ముందుగా జిల్లా లో అనంత గిరి హరిత రిసార్ట్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా జడ్జి డాక్టర్. సున్నం శ్రీనివాస్ రెడ్డి లు పూల మొక్క అందజేసి గౌరవ స్వాగతం పలికారు.

4

అనంతరం పోలీస్ శాఖ వారి చే గౌరవ వందనం స్వీకరించారు.అదేవిదంగా మంగళ వాయిద్యాలు,వేద మంత్రాల మధ్యదేవస్థానం ఇ ఓ, ఆలయ అర్చకుల చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదర్శన నిర్వహించి అనంత పద్మనాభ స్వామికి తులసి సేవలు, అర్చనలు జరిగాయి.వేదపండితులచే వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామి వారి జ్ఞాపికను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓ నరేందర్, ప్రధాన అర్చకులు శేష గిరి, పద్మనాభం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

5

6

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like