అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం.. మురికి నీరు నిల్వతో స్థానికుల ఇక్కట్లు

by RMK NEWS
0 comments

ఖమ్మం స్థానిక ఇందిరానగర్ కాలనీ 10వ డివిజన్ లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా వదిలివేయటంతో మురికి నీరు నిల్వతో జ్వరాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. డ్రైనేజీ లను పూర్తి చేయకుండా వదిలివేయటంతో ఇనుపచువ్వలు బయటకు వచ్చి, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అన్ని డివిజన్ లను పర్యవేక్షించి మేయర్ 10వ డివిజన్ ప్రజలు ఇబ్బందులను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. డివిజన్ కార్పొరేటర్ ప్రజాసమస్యలను గాలికొదిలేసారని బాహాటంగా మాట్లాడుకోవటం చర్చనీయంశంగా మారింది. ఇకనైన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ లను పూర్తి చేసి మురుగు నీరు నిల్వలేకుండా చుడాలని స్థానికులు కోరుతున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like