ముద్ర, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, బంగారు వస్తువులు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున దాసరి నర నివాసంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆయన నివాసంతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్ లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలను నిర్వహించారు.
నిజామాబాద్ కోసం వినాయక నగర్ అశోక టవర్స్ లో ఉన్న నర ఇంట్లో రూ. 2.93 కోట్ల నగదును పేర్కొన్నారు. ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.10 కోట్ల నగదు, 51 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.98 కోట్లు విలువైన 17 స్థిరాస్తులను పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ అక్రమాస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
Get real time update about this post category directly on your device, subscribe now.