ముద్రణ న్యూస్ బ్యూరో , హైదరాబాద్: కనకమామిడిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి సహాయం అందించాలని ఆలయ కమిటీ నాయకులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ నాయకులు కోట్ల బల్వంత్ రెడ్డి, మల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, గోవిందురెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంతిరెడ్డి గారి మోహన్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాదులో టిటిడి చైర్మన్ ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.
కనకమామిడిలో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి గతంలో అందిన సహాయం గురించి వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. టీటీడీ నుంచి మరింత ఆర్థిక సహాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసారు. కమిటీ ప్రతిపాదన ఆలయాన్ని సందర్శించడానికి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అంగీకరించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.