ముద్ర,సెంట్రల్ డెస్క్:-తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఢిల్లీలోని వారి ఛాంబర్లలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు, తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కోసం మంత్రులకు అధికారులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత చిన్నగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. అటు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎలాంటి ఆడంబరం లేకుండా సాదాసీదాగా బాధ్యతలు స్వీకరించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.