కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by RMK NEWS
0 comments

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. అదేవిధంగా తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like