భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగుబల్లికి చెందిన స్వప్న పురిటి నొప్పులతో సోమవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు.
మంగళవారం నొప్పులు ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు డాక్టర్లను సంప్రదించడానికి ప్రయత్నించారు.. గైనకాలజిస్టు అక్కడ లేరు. దీంతో వారు ఎమ్మెల్యే వెంకట్రావుకు ఫోన్ ద్వారా తెలియజేసారు. ఆయన హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకుని.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి స్టాఫ్ కూడా ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన వెంటనే స్వప్నను ఆపరేషన్ థియేటర్కు తరలించి సిజేరియన్ డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డను చూసి స్వప్న మురిసిపోయింది. ఎమ్మెల్యే వెంకట్రావుకు స్వప్నతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.