ముద్ర ప్రతినిధి, భువనగిరి : మంగళవారం రామకృష్ణపురం గ్రామంలో చామల యువసేన నాయకులు హీరేకర్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మహిళా రైతులు, వ్యవసాయ క్షేత్రం వద్ద ఘనంగా కేక్ కటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భువనగిరి పార్లమెంటు ఎంపీగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పుట్ట గిరీష్ కుమార్ గౌడ్, బోయిన బాలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగరావు, సుబ్బు సిద్దులు, పన్నాల మల్లికార్జున్ రెడ్డి, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు సామల రవీందర్, గోపె ఎల్లయ్య, నరసింహ, శ్రీను, సురేష్, ఎల్లారెడ్డి, మహిళా కూలీలు వరకు.
Get real time update about this post category directly on your device, subscribe now.