73
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకు చనిపోయినట్లు కనిపిస్తున్నాయి. 30 మంది వరకూ గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Get real time update about this post category directly on your device, subscribe now.