సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి నేడు అందుబాటులో ఉన్నారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, రామలింగేశ్వరనగర్, జక్కంపూడిలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి… చంద్రబాబు జేసీబీ సాయంతో ఇతర బాధితులను పరామర్శించారు.
నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. ఓ వైపు పరామర్శలు, తదుపరి సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడిక్కడే అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన.వరద బాధితులతో #APGovt#CBNs ఫాదర్లీ కేర్#2024APFloods Relief#ఆంధ్రప్రదేశ్ pic.twitter.com/dRWAp78j7t
— తెలుగుదేశం పార్టీ (@JaiTDP) సెప్టెంబర్ 2, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.