జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా ఖరీదైనా కలప రవాణా..

by RMK NEWS
0 comments

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం భైరపురం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టన్న అనే బొగ్గుల వ్యాపారి అక్రమంగా ఖరీదైనా కలపను రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏపీ లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లా ప్రాంతం నుండి పిచ్చి మొక్కల కలపను వాటితోపాటు.. ఖరీదైన వేప, తుమ్మ, మామిడి రాగి ఇలాంటి ఖరీదైన కలప ను నరికి వాటిని చిన్న చిన్న ముక్కలు గా కటింగ్ చేసి తరలిస్తున్నారు. అక్కడ ఉన్న కూలీల కు తక్కువ కూలీల ధరలు ఇచ్చి వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అలాగే కూలీలకు ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించకుండా వెట్టి చాకిరీ పనులు చేయిస్తూ అధికామొత్తం లో కిష్టన్న అనే వ్యక్తి లాభాలు పొందుతున్నారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి అయినా మన్యం నకు సమాచారం ఇవ్వగా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇస్తూ మీరు ఒక్కసారి వచ్చి నన్ను కలవండి అని పాత్రికేయులకు తిరిగి అసహ్య సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like