తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం

by RMK NEWS
0 comments

శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 73,353 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 28,444 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like