తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది: ఎమ్మెల్యే హరీష్ రావు

by RMK NEWS
0 comments

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజా స్వామిక విధానాలకు చెంపపెట్టు అన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరా యించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజ కవర్గాల్లో బీఆర్ఎస్ తప్ప కుండా గెలుస్తుందన్నారు. హైకోర్డు తీర్పునకు అనుగు ణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడ తారని ఆశిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like