76
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నిన్న అర్ధరాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.
Get real time update about this post category directly on your device, subscribe now.