ధర్మజాగరణ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం సనాతన ధర్మం కోసం రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం నుండి రథంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు వేద పండితులచే పూజలు జరిపి ప్రారంభించారు. ఈ రథయాత్ర ఇవాళ నుండి ఈనెల 31 వ తేదీ వరకు జగిత్యాల జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో ఉంటుందని హిందూ ధర్మజాగరణ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ సమితి జిల్లా ప్రముఖ్ వేముల రాంరెడ్డి, జిల్లా పూర్తి సమయ ప్రముఖ్ సిద్ధంశెట్టి మహేష్, హిందు వాహిని ప్రాంత సహ సంపర్క్ ప్రముఖ్ వేముల సంతోష్ జీ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ కాయితి గంగాధర్, రాయికల్ మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.