నేటి నుంచి రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటన చంద్రబాబు – RMK News

by RMK NEWS
0 comments
నేటి నుంచి రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో నిధులు సమకూర్చనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఆయన కుప్పానికి బయలుదేరి వెళుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్ళనుంది. కుప్పం పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆర్ అండ్ బీ భవనంలో పార్టీ నేతలతో సమావేశమై కీలక చర్చలు జరపనున్నారు. బుధవారం కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద వినతులను సీఎం చంద్రబాబు నాయుడు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశమవుతారు. బుధవారం సాయంత్రం హెలికాప్టర్ లో అమరావతికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి వెళుతున్నారు. దీంతో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖండ మెజారిటీని సాధించి నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కుప్పం నియోజకవర్గానికి వస్తుండడంతో ప్రజలు పాల్గొన్నారు. పార్టీ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like