77
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ గుర్తించారు.పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించిన తరువాత సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.