ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని ఆత్మహత్య..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని ఆత్మహత్య..! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

వైద్య విద్య చదువు కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ (19) ఫిలిప్పీన్స్‌లోని పెర్చక్యువెల్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. త్వరలో మెడిసిన్ మూడవ సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో చనువు చాలించింది. గురువారం రాత్రి చింత స్నిగ్ధ తన గదిలో నిద్రపోయింది. ఉదయం పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు స్నేహితులు ఆమె గది వద్దకు వెళ్లి పిలిచారు.

కానీ గది తలుపులు ఎంతకూ తీయగా ఇండియాలోని ఆమె తండ్రికి ఫోన్ చేశారు. దాంతో విద్యుత్ శాఖలో డిఇగా పనిచేస్తున్న ఆమె తండ్రి అమృతరావు గది తలుపులు పగులగొట్టాలని సూచించడంతో వారు గది తలుపుల పగులగొట్టి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఉన్నత కూతురు విద్య కోసం వెళ్లి, తిరిగి వస్తుందన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులు ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. తమ మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని, ఆయన ఉన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like