భారీ వర్షాలకు కూలిన ఇల్లు

by RMK NEWS
0 comments

నల్లగొండ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ఇండ్లు కూలిన సంఘటన వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన పజ్జూరి ఎల్లమ్మ ఇల్లు రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అని తెలిపారు.రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా…ఒక్కసారిగా భారీ వృక్షం కూలి ఇల్లు మీద పడడంతో నేలమట్టం అయింది.ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణానష్టం జరగలేదు. ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలని బాధితులు కోరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చూడాలని వేడుకున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like