భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 ట్రైన్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ఈ నెల(సెప్టెంబరు) 4, 5, 7 తేదీల వరకు పలు రైళ్లు క్యాన్సిల్ అయినట్లు వెల్లడించింది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని దక్షిణ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే భారీ వరదతో మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రాక్ మరమత్తు పనులు కొనసాగుతున్నాయి. రెండ్రోజుల్లో ట్రాక్ పనులు పూర్తి అవుతాయని, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ గుండా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు చేశారు. 152 సర్వీసులను దారి మళ్లించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.