ముద్ర,సెంట్రల్ డెస్క్:-రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో మునిగి మృతి చెందారు. మరణించిన నలుగురిలో 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు కాగా,మరో ఇద్దరు యువకులు . వారంతా వెలికి నొవ్గోరోడ్ సమీపంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు.
కాగా, వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడిన ఉన్న ఓ భారతీయ విద్యార్థిని నీటిలో మునిగింది. ఆమెను రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యార్థినితోపాటు మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు. ఓ బాలుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. “సరైన వైద్యం అందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నామని సెయింట్ పీటర్స్బర్గ్లోని ఇండియన్ మిషన్ “ఎక్స్”లో రాసింది.
Get real time update about this post category directly on your device, subscribe now.