రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం, ఎస్టీపీ అంబర్ పేట్ కార్మికుల కోసం, శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గురువారం నిర్వహించిన ఈ జలమండలి మేనేజింగ్.అశోక్ రెడ్డి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ , ఎస్టీపీ జి.ఎం సుబ్రమణ్యం, జలమండలి ఆఫీసర్ పీఏ మహేష్ కుమార్, రామంతపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ వైద్యులు ఉన్నారు.

6

దాదాపు మూడు వందల మందికి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, ఇసిజి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యాన్ని తెలుసుకుని, వారికి సరిపడ మందులను నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్టీపీ జీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు, ఇలాంటి వైద్య శిబిరాలు మరి కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

7

ఈ వైద్య శిబిరం సహకరించిన కిమ్స్ ఆసుపత్రి, భారత్ వికాస్ పరిషత్ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరం విజయవంతం అయిందని, సేవకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేసిందని శ్రీ రామానుజ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు.

8

9

10

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like