గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పేరుతో పలు హామీలు అమలు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఈ పథకాలను అమలు చేయడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ కీలక హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీలుగా భావించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ (రైతులకు ఆర్థిక సాయం) పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమ్మకు వందనం జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు తల్లులకు లబ్ధి చేకూరనుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న వారందరికీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.15000 చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఈ నేరుగా తల్లి ఖాతాలోకి జమ చేయనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా 15000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. అయితే ఇందులో రెండు వేల రూపాయలను స్కూల్ నిర్వహణ కోసం కట్ చేసి రూ.13000 మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేసింది. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పూర్తిగా రూ.15 వేల రూపాయలను ఖాతాల్లో జమ ప్రకటించింది. గతంలో ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఈ వైసీపీ కూటమి వర్తించేలా నిబంధనలు పెట్టగా, ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రభుత్వం అందరికీ ఈ వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. నుంచి ఈ చర్య అమలు ముఖ్యమంత్రి నిర్ణయం జనవరి నుంచి లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జూనియర్ కాలేజీలు, పాఠశాలకు
Get real time update about this post category directly on your device, subscribe now.