తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం. ఈ దీక్షలో భాగంగా ఆయన ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్య క్రమం చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్య క్రమం నిర్వహించారు.
అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కొనసాగుతున్నారు.మొదట ఆలయం మెట్లను నీటితో జనసేనాని శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.
ఇక ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 1న పవన్ విరమించనున్నారు. దీనికోసం ఆయన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లనున్నారు. 2వ తేదీన వెంకటేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత దీక్ష విరమించనున్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.