విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీసీ నోటీసులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీసీ నోటీసులు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


అమరావతి, ముద్రణ వార్తలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

2

తాజాగా విశాఖలోనూ వైసీపీ కార్యాలయానికి జీవీసీఐ నోటీసులు అందజేసింది. ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు నోటీసులలో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్, జీవీకే కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జోన్. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసలు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది.



Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like