ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కార్డ్యక్ట్ వెయిటింగ్ హాల్ నందు విశ్వ చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ డిడి కస్తాల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల రవికుమార్, స్తంబద్రి హాస్పిటల్స్ డాక్టర్ గట్టినేని సురేష్, ఎస్బిఐ మేనేజర్ వివి సాగర్ లు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ ప్రాణాలని కోల్పోతున్నారని, విశ్వ చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం ఆలోచించి కొంతమంది ప్రాణాలైనా కాపాడాలని ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. రానున్న రోజుల్లో తమ సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. గతంలో ఈ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టామని, అలాగే ముందు ముందు మరెందరికో ఉపయోగపడేల కార్యక్రమాలను నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ పాపగంటి శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నె సురేష్, పగిడిపల్లి హరీష్, మంద సతీష్, మోదుగు బాబు, దర్శి కమల్, మురళి, పాపారావు, కే.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.