సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

by RMK NEWS
0 comments

గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఏ కష్టం వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి లు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లి యదుభూషణ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like