హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా విశాఖ వేస్ట్ లో పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ

by RMK NEWS
0 comments

దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా విశాఖ వేస్ట్ లో పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని జింకు గేటు దగ్గర ర్యాలీకి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు. అక్కడి నుండి హిమాచల్ నగర్ టిడిపి కార్యాలయంకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటిదాకా పంచాయతీకి వంద రూపాయలు మేజర్ పంచాయతీకి 250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు కింద ఇచ్చేది కానీ మన ప్రభుత్వం ఏర్పాటుగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి 10000 మేజర్ పంచాయతీకి 25000 చొప్పున ఇవ్వడం జరిగింది చాలా శుభదాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించగా బిజెపి వెస్ట్ కన్వీనర్ దాడి పురుషోత్తము రమేష్ ములగాడ మండల అధ్యక్షులు కవులూరి గురుమూర్తి బిజెపి రాష్ట్ర ఎస్సీ మోక్ష ఉపాధ్యక్షులు కొక్కిలిగడ్డ విజయబాబు, తేప్పల సతీష్, గుర్తుల సతీష్ జనసేన నాయకురాలు అంగా దుర్గ ప్రశాంతి గారు, టిడిపి నాయకులు, విశ్వనాధుల దినకర్, నక్క లక్ష్మణరావు tntuc presideny, c h రాము, మిత్తిరెడ్డి శంకర్రావు , పూడి భాస్కరరావు, కోరాడ శ్రీనివాసరావు, మాత శ్రీనివాసరావు, మజ్జి సోమేశ్ గారు, గేదెల రమణగారు, పోతాబత్తుల శ్రీనివాసరావు, జనసేన అనిల్ , అధిక సంఖ్యలోకూటమి నాయకులు పాల్గొన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like