- వారికి మత్తుపదార్ధాలు అలవాటు చేశాడు
- కేటీఆర్ బాధలు పడలేక కొందరు తొందరపడి పెళ్లి చేసుకున్నారు
- నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
- హిరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు
- కేటీఆర్ పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : సినీ హీరోయిన్ల సెల్ ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్ధాలు అలవాటు చేసి వారి కెరీర్ పై దెబ్బ కొట్టారని. ఆయన బాధలు పడలేకే కొంత మంది హీరోయిన్లు తొందరపడి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లడానికి కారణం కూడా కేటీఆరే అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్లోని బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొండా సురేఖ అక్కడ మీడియాతో మాట్లాడారు.
నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని తెలిపారు.అసలు ఆయనకు మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు తెలియవన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన పోస్టుల విషయంలో కేటీఆర్ సిగ్గు మాట్లాడకుండా ఉన్నారు. తనపై ట్రోల్ చేసిన పోస్టులపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.. తన విషయంలో స్పందించిన హరీష్ రావు బెటర్ అన్నారు.బామ్మర్ది కంటే..బావకు సంస్కారం ఉందని చురకలంటించారు. తనపై వచ్చిన పోస్టింగ్ లపై కేటీఆర్ తనకు సంబంధం లేదు మూడు రోజుల క్రితమే చెప్పాల్సింది అన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.