‘హైడ్రా’ భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ.. స్పందించిన హైడ్రా కమిషనర్

by RMK NEWS
0 comments

హైడ్రా కూల్చివేతల కారణంగా శుక్రవారం కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనపై శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు. తాము ఎవరికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని అన్నారు. బుచ్చమ్మ తమ కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నాయి.. కానీ అవి ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయని అన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like