ఖమ్మం నగరంలో 28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి పురస్కరించుకుని అలాగే ఎమ్మార్పీఎస్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పెద్ద మాదిగైన వడ్లమూడి కోటయ్య పాల్గొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక డివిజన్ ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 21 మంది యువకులతో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంచలంచలుగా ఎదిగి ఉద్యమం ద్వారా సమాజంలో పేద ప్రజలందరికీ “ఆరోగ్య శ్రీ” కార్డులు అలాగే వికలాంగులకు , వృద్ధులకు , వితంతువులకు , ఒంటరి మహిళలకు పెన్షన్లు అందేలా చేశామని తెలిపారు.
Get real time update about this post category directly on your device, subscribe now.