పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్.. వారి కుటుంబానికి వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ రూ. 50 వేలు చెక్కు ను అందజేశారు. ఈనెల 28 వరకు నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని కావున గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్నవారు 500 రూపాయలు రుసుము కట్టి రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగం వాసు, గవర శ్రీను, సంతోష్, నాయుడు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.