లేడీ కిల్లర్స్ – అప్పు తీసుకుంటారు – అడిగితే కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌తో కలిపి చంపేస్తారు..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
లేడీ కిల్లర్స్ - అప్పు తీసుకుంటారు - అడిగితే కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌తో కలిపి చంపేస్తారు..! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లమూడిలో నాగూర్‌ బీని అనే మహిళ జూన్ నెలలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ముగ్గురు లేడీ కిలర్స్ అప్పు తీసుకుని, అడిగితే చంపేస్తారని దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

నాగూర్‌ బీని నుంచి అప్పు తీసుకున్న ముగ్గురు కిలాడీ లేడీలు ఆమె అప్పు అడిగినందుకు బ్రీజర్‌లో సైనెడ్ కలిపి చంపేసినట్లు పేర్కొన్నారు. ఇలా మరో నాలుగు హత్యలు చేసిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో కంబోడియా వెళ్లొచ్చిన ప్రధాన నిందితులు వెంకటేశ్వరి అక్కడ పలు నేరాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు.నిందితుల్లో మరొకరు వాలంటీర్‌గా పనిచేశారు. ముగ్గురు నిందితులు రెండేళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసినట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌కి సైనైడ్ అమ్మిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like