60
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మత సామరస్యం వెల్లివిరిసింది. చిన్నంబావి మండలానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో తాజోద్దీన్, మహమ్మద్ అనే ముస్లిం సోదరులు పాల్గొని రూ.15 వేలకు గణనాథుని లడ్డును దక్కించుకున్నారు. ఈ సంఘటన కుల, మత సామరస్యతకు ప్రతీకగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.