సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం… తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం... తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం... తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపిన నెయ్యి నేర్చుకునేందుకు విస్తృతంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు ఓ లెటర్ పిటిషన్ అందింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు.

తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వెల్లడి కావడంతో జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు. ”టీటీడీ ట్రస్ట్ గత మేనేజ్‌మెంట్ హయాంలో మాంసాహార ఉత్పత్తులను ‘ప్రసాదం’ తయారీలో ఉపయోగించినట్లు ఇటీవలి పరిశీలనలో ఆందోళన కలిగించే నిజం బయటపడింది. ముఖ్యంగా పక్షి మాంసాన్ని (కోలిస్) వాడారు. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడమే కాకుండా మత విశ్వాసాలపై దాడి చేసినట్టు అవుతుంది.

మాంసాహార ప్రసాదం తయారీలో ఉపయోగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమే. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది” అని న్యాయవాది సత్యం సింగ్ ప్రకటించారు.ప్రసాదం తయారీ, పంపిణీ హిందూమత ఆచరణలో అంతర్భాగమని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో స్థిరపడిందని అన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం భక్తుల హక్కులను నిర్వాహకులు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం మన పవిత్ర సంస్థల నిర్వహణను వేధిస్తున్న ఒక పెద్ద సమస్యను ఎత్తిచూపుతున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.


Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like