TTD News -జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
TTD News -జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్‌లాట్ టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేయబడ్డాయి, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేయబడ్డాయి.

తిరుప-తిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్‌తో పాటు(తిరుమలలో బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుమల స్థానికుల కొరకు) కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీ చేశారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉంటుందని తెలిపారు.

కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న క్యూ ప్రత్యే లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌కు చెందిన భక్తులు మీకు కేటాయించిన సమయానికి తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో చౌదరి, టీటీడీ జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్‌లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ స‌త్య‌నారాయణ, ఎస్‌ఐ వెంక‌టేశ్వ‌ర్లు, మనోహర్, ట్రాన్స్‌పోర్ట్‌ఎం శేషారెడ్డి, తదితర టీటీడీ అధికారులు, పోలీసు, సిబ్బంది ఉన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like